టీడీపీ హయాంలో ముందస్తు అనుమతితోనే భూములు కొన్నట్టుగా కేసు ఎదుర్కొంటున్న మాజీ అడ్వకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది దమ్మాల పాటి శ్రీనివాస్ అలాగే మరి కొందరు వ్యక్తులపై హైకోర్టు లో విచారణ జరగనుంది. ఇక ఇప్పటికే  ఈ కేసు లో సుప్రీం కోర్టు లో స్టే  ఉండడంతో ప్రభుత్వం ప్రభుత్వం గత వారం వేసిన పిటిషన్ ను ఉపసంహరించుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వచ్చే నాలుగు వారాల్లో నే కేసులు పరిష్కరించ బోతున్నారు. వాస్తవానికి ఆగస్టు 5వ తేదీ లోపు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు హైకోర్టు ఆదేశాలు జారీ చేయగా, 12 వ తేదీ లోపు కౌంటర్ రిజాయిండర్ వేయాలని దమ్మాల పాటి శ్రీనివాస్ తరఫున న్యాయవాదులు హైకోర్టుకు కోరారు. దీంతో ఆగస్టు 12 వ తేదీన మరోమారు విచారణ చేపడతామని హైకోర్టు ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: