గత కొన్ని రోజులుగా బాలీవుడ్ లో రాజ్ కుంద్రా కేసు విషయమై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ పోర్న్ రాకెట్ కు సంబంధించి మీడియాలో ఎన్నో కథనాలు వెలువడుతున్నాయి. అందులో నిజం ఎంతుందో? అబద్ధం ఎంత ఉందో? తెలియదు గానీ బాలీవుడ్లో మాత్రం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 

రాజ్ కుంద్రా కేసు విషయమై పోలీసులకు కీలక ఆధారాలు లభించాయని, డబ్బులు కూడా భారీగా దొరికాయని,  మనీలాండరింగ్ విషయంలోనూ ఈడి ఆయనను ప్రశ్నించే అవకాశం ఉందని, ఇందులో శిల్పాశెట్టి ప్రమేయం విషయం కూడా పోలీసులు పరిగణలోకి తీసుకున్నారని, ఈ యాప్ ఆరోపణల్లో ఆమె ఖాతా ద్వారా కూడా లావాదేవీలు జరిగాయని, అందుకే ఆ విషయంలో పోలీసులు ఇంకా క్లీన్ చిట్ ఇవ్వలేదంటూ ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. తాజాగా అశ్లీల కేసులో తన భర్త రాజ్ కుంద్రా పై ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పా శెట్టి పరువు నష్టం దావా వేయడం సంచలనంగా మారింది. 29 మంది మీడియా సిబ్బంది, మీడియా సంస్థల పై తప్పుడు రిపోర్టింగ్ చేస్తున్నారంటూ, తన ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నారంటూ కేసు వేసింది. ఈ కేసు పై రేపు విచారణ జరగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: