రెబల్ స్టార్ ప్రభాస్ రొమాంటిక్ ఎంటర్టైనర్ "రాధేశ్యామ్". రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ వారు అత్యంత భారీ బడ్జెట్ నిర్మిస్తున్నారు. ఇప్పుడు ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఈ నెలాఖరులో విడుదల కావాల్సి ఉంది. 

కానీ కరోనా పరిస్థితుల వల్ల వాయిదా పడింది. తాజాగా ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్తూ యువి క్రియేషన్స్ వారు అప్ డేట్ ఇచ్చారు. కరోనా వల్ల నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా జూలై 30న విడుదల కావాల్సిన "రాధేశ్యామ్" రిలీజ్ చేయలేకపోయాము. కానీ అదే రోజున ఈ సినిమా నుంచి అప్డేట్ ఇస్తాము. రేపు ఉదయం 9.18 గంటలకు అప్డేట్ రానుంది" అంటూ అధికారికంగా ప్రకటించారు. మరి రేపు ఏం అప్డేట్ ఇవ్వబోతున్నారు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: