హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యం లో ఈటల రాజేందర్ ప్రజా దీవెన పాద యాత్ర చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే గత రెండు రోజులుగా ఆయన తీవ్ర అస్వస్థత కు గురయ్యారు. ప్రస్తుతం వైద్యుల సంరక్షణ లో ఉన్న ఈటల రాజేందర్ కు గత రెండు రోజులుగా కాళ్లకు పొక్కులు, తీవ్రమైన జ్వరం వేదిస్తుండటం తో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. పాదయాత్ర కు మూడు, నాలుగు రోజుల పాటు విరామం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. గత వారం రోజులుగా లంచ్ బ్రేక్ లో వైద్యులు ఈటెల రాజేందర్ కి ట్రీట్మెంట్ అందిస్తుండగా, కొన్ని రోజుల పాటు విరామం తీసుకోవాలని వైద్యులు సూచించారు. అయితే షెడ్యూల్ ప్రకారం రెండు గ్రామాల్లో ఈటెల రాజేందర్ భార్య జమున పాద యాత్ర చేసే అవకాశం కనిపిస్తోంది.కానీ ఈటెల రాజేందర్ ఒక రోజు విశ్రాంతి తర్వాత తిరిగి పాదయాత్ర చేసే అవకాశం కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: