ప్రముఖ శ్రీలంక క్రికెటర్లకు షాక్ తగిలింది. యూకే కి సంబంధించిన ఓ వివాదంలో రిలేషన్ ఉండడంతో వారిపై క్రికెట్ బోర్డు యాజమాన్యం ముగ్గురు క్రికెటర్లపై నిషేధం విధించింది. వివరాల్లోకి వెళితే... శ్రీలంక క్రికెట్ బోర్డు గుణ తిలక, కుశాల్ మెండిస్, డిక్ వెల్లా అనే ముగ్గురు క్రికెటర్లపై బ్యాన్ విధించింది. దీని ప్రకారం ఏడాది కాలం పాటు వారు ఎలాంటి ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లోనూ పాల్గొనకూడదు. మరో ఆరు నెలల పాటు డొమెస్టిక్ క్రికెట్ కు దూరంగా ఉండాలి. అంతే కాకుండా ఈ ముగ్గురికి 10 మిలియన్ల శ్రీలంక డబ్బును ఫైనల్ గా వేసింది. వీరు ముగ్గురికి యూకే కు సంబంధించిన బయో బబుల్ బ్రీచ్ తో సంబంధం ఉండడమే నిషేధానికి కారణమని తెలుస్తోంది. ఈ ప్రముఖ క్రికెటర్ లు ఏడాది పాటు ఇంటర్నేషనల్ క్రికెట్ కు దూరం కావడం పట్ల వారి అభిమానులు నిరాశ చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: