పతక వేటలో దూసుకెళ్తున్న తెలుగుతేజం పీవీ సింధు.. గోల్డ్ మెడల్ టైటిల్ కు అడుగు దూరంలో నిలిచింది. టోక్యో ఒలింపిక్స్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు... నేడు సెమీ ఫైనల్ మ్యాచ్ లో తలపడనుంది. గ్రూప్ జే, ప్రీ క్వార్టర్ ఫైనల్, క్వార్టర్ ఫైనల్లో ఒక్క సెట్ కూడా ఓడకుండా వచ్చిన సింధు... ఒలింపిక్స్ లో రెండుసార్లు సెమీస్ చేరుకున్న తొలి భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ గా రికార్డుల్లోకి ఎక్కింది. సెమీఫైనల్ లో చైనీస తైపీకి చెందిన  రెండో సీడ్ షట్లర్ తై జు యింగ్ తో సింధు తలపడనుంది. ప్రీ క్వార్టర్ వరకు సునాయాసంగా గెలుచుకుంటూ వచ్చిన సింధు.. క్వార్టర్స్ లో మాత్రం... కాస్త గట్టి పోటీ ఎదుర్కుంది. అయినప్పటికీ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా వరుస సెట్లు సొంతం చేసుకుని.. సెమీస్ లోకి దూసుకెళ్లింది. తై జు యింగ్ పై సింధు గెలిస్తే... భారత ఖాతాలో ఒక మెడల్ చేరినట్లే. ఇప్పటికే జోరు మీదున్న సింధును అడ్డుకోవడం తై జు యింగ్ కు కొద్దిగా కష్టమే. ఇప్పటకే వీరిద్దరి మధ్య 15 మ్యాచ్ లు జరగగా... అందులో 11 సార్లు పీవీ సింధు విజయం సాధించింది. నాలుగు మ్యాచ్ లలో మాత్రమే తై జు యింగ్ సొంతం కష్టం మీద గెలుచుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: