ప్రతి ఏడాది మాదిరే ఈ సారి కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి ఎర్రకోట మీద నుంచి ప్రసంగించనున్నారు. ప్రతి ఏడాదిలానే ఈ సారి కూడా ప్రజలకు మోదీ విజ్ఞప్తి చేశారు. ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన తర్వాత జాతినుద్దేశించి మోదీ కీలక ప్రసంగం చేయనున్నారు. నేనేం మాట్లాడాలో మీరే సూచించండి అంటూ మోదీ మరోసారి ప్రజలను విజ్ఞప్తి చేశారు. ప్రతి ఏడాది కూడా పంద్రాగస్టు సందర్భంగా తన ప్రసంగంలో ఉండాలనుకుంటున్న అంశాల గురించి ప్రజల నుంచి మోదీ సూచనలు, సలహాలు స్వీకరిస్తున్నారు. ఈ ఏడాది కూడా అదే ఆనవాయితీ కొనసాగించనున్నారు. మీ మాట... నా నోట... అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేసిన వెంటనే... నెటిజన్ల నుంచి విశేష స్పందన వచ్చింది. మోదీ సార్ సెకండ్ వేవ్ పై వివరణ ప్లీజ్ అని కొందరంటే... పెగాసస్ అంటే ఏమిటో వివరించాలి సార్ అని మరికొందరు ట్వీట్ చేశారు. కొందరైతే... పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తామని ప్రకటించండి చాలు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: