టోక్యో ఒలింపిక్స్‌లో ఈరోజు 9వ రోజు. ఇక ఈరోజు డిస్కస్ త్రోలో భారతకు చెందిన కమల్‌ప్రీత్ కౌర్ బాగా రాణించింది. దీంతో ఆమె ఫైనల్స్‌కు చేరుకున్నారు. కమల్‌ప్రీత్ భారతదేశానికి పతకం సాధించడానికి చాలా దగ్గరగా ఉందనే చెప్పాలి. నిజానికి ఆమె  మూడో ప్రయత్నంలో 64 మీటర్లు విసిరారు. ఇక అదే సమయంలో, ఆర్చరీ మరియు బాక్సింగ్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. ఆర్చర్ అతాను దాస్ మరియు బాక్సర్ అమిత్ పంఘల్ ఓడిపోయిన తర్వాత పోటీ నుంచి అవుట్ అయ్యారు. ఇద్దరూ ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయారు. ఇప్పుడు బాక్సర్ పూజా రాణి మీదనే ఆశలు ఉన్నాయి. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ గెలిచిన వెంటనే ఆమె పతకాన్ని నిర్ధారిస్తుంది. ఇక వీరు కాకుండా, పివి సింధు సెమీ ఫైనల్ మ్యాచ్ గెలవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. మరి చూడాలి ఏమవుతుందో అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: