కుక్క పిల్ల సబ్బు బిళ్ళ అగ్గిపుల్ల ఆడపిల్ల కాదేదీ కవితకు అనర్హం అన్నాడు ఒక మహాకవి. ఇప్పుడు దాన్ని ఆదర్శంగా తీసుకున్న కేటుగాళ్లు ఏకంగా పోలీస్ బాస్ డీజీపీని కూడా వదలడం లేదు. తాజాగా తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఫోటోలు సోషల్ మీడియాలో డిస్ప్లే పిక్చర్ గా పెట్టుకుని మోసాలకు తెగబడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. డిజిపి ఫోటో పెట్టుకుని చీటింగ్ చేస్తున్న వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలని ఒక వ్యక్తి సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో దీనిని సుమోటోగా తీసుకుని సైబర్ క్రైమ్ పోలీసులు అసలు ఈ వ్యవహారం వెనుక ఎవరు ఉన్నారు అని తెలుసుకునే పనిలో పడ్డారు.. ఇదే తీరున ఆంధ్రప్రదేశ్ లో ఒక మంత్రి పేరిట ఇలా ఫేక్ అకౌంట్ పుట్టుకురావడం సంచలనంగా మారింది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మంత్రి పినిపే విశ్వరూప్ పేరిట సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ తెరిచిన కేటుగాళ్లు ఆయన అడుగుతున్నట్లు గా డబ్బు సహాయం చేయమని అడగడం సంచలనం రేపుతోంది. దీని మీద పోలీసులకు ఫిర్యాదు అందినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: