శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే దానిమీద చాలా రోజుల నుంచి అనేక రకాల చర్చలు జరుగుతుండగా ఎట్టకేలకు ఈ సినిమాలో హీరోయిన్ గా నటించేది కియారా అద్వానీ అండ్ క్లారిటీ ఇచ్చారు.
ఈరోజు కియారా అద్వానీ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఈ సినిమాలో భాగం అవుతుంది అంటూ దిల్ రాజు ప్రొడక్షన్ సంస్థ  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధికారికంగా ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. ఇక శంకర్ సినిమాలో రామ్ చరణ్ సీఎం పాత్రలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముందు ఐఏఎస్ అయినా ఆయన ఆ తర్వాత అప్పటి సీఎంతో చాలెంజ్ చేసి సీఎం అవుతాడని, ఒకే ఒక్కడు లైన్ లోనే ఈ సినిమా కూడా ఉండబోతోంది అంటూ ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: