ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర విషాదకర ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. వెనుకబడిన జిల్లా గా పేరు పొందిన శ్రీకాకుళం జిల్లా లో స్నానానికి వెళ్లి ఇద్దరు గిరిజన బాలికలు నేల బావిలో పడి పోయి జలసమాధి అయిన ఘటన కన్నీరు తెప్పిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే శ్రీకాకుళం జిల్లాలో ఉన్న భామిని మండలం కోటకొండ అనే గిరిజన గ్రామంలో గ్రామానికి చెందిన కీర్తి, అంజలి అనే ఇద్దరు బాలికలు స్నానం చేసేందుకు గ్రామంలో ఉన్న ఒక నేల బావి దగ్గరకు వెళ్లారు.


 అయితే వీరిద్దరు స్నానానికి దిగినప్పుడు ఎవరూ వీరిద్దరిని చూడలేదు. ఎంతసేపటికి వీరిద్దరూ కనిపించకపోవడంతో గ్రామస్తులు వీరికోసం గాలించగా బావిలో బాలికల మృతదేహాలు కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని బావిలో నుంచి బాలికల మృతదేహాలను బయటకు తీయించారు. ప్రమాదవశాత్తు బావి లోతుగా ఉండడంతో వారు అందులో మునిగి పోయి చనిపోయి ఉంటారని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: