జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల మళ్లీ కలకలం రేపారు. దీంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగి ఉగ్రవాదులను ఏరివేసే కార్యక్రమాల్లో తలమునకలై ఉన్నాయి. తాజాగా అందుతున్న సమాచారం మేరకు దాచిగం అనే ఒక ఫారెస్ట్ ఏరియాలో నాగ్ బారన్, మర్శార్ అనే రెండు ప్రాంతాల మధ్య ఉన్న ఈ ప్రదేశంలో ఎన్కౌంటర్ జరగగా ఇద్దరు టెర్రరిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఈ చనిపోయిన ఇద్దరు టెర్రరిస్టులు ఏ ఉగ్రవాద సంస్థకు చెందిన వారు అనే విషయం అయితే ఇంకా వెలుగులోకి రాలేదు. 


అయితే ఫారెస్ట్ ఏరియా లో మరికొంత మంది ఉగ్రవాదులు నక్కి ఉంటారనే ఉద్దేశంతో కాశ్మీర్ జోన్ పోలీసులు ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులతో కలిసి సైన్యం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించడంతో వీరి మీదకు ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు మొదలుపెట్టారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు తిరిగి కాల్పులు జరపడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు

మరింత సమాచారం తెలుసుకోండి: