పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 300 వీధి కుక్కలకు విషం పెట్టి చంపేశారు. లింగపాలెం పంచాయతీ అధికారులు ఈ ఘటనకు పాల్పడ్డారు. వీధి కుక్కల పై కనికరం కూడా చూపకుండా విష‌పు ఇంజక్షన్లతో మొత్తం 300 శున‌కాల‌ను చంపేశారు. అనంతరం వాటిని ఓ గుంత‌లో పడేసారు. అయితే వాటిపై మ‌ట్టి కూడా క‌ప్పకుండా పూడ్చి వేయడం కలకలం రేపుతోంది. ఇక ఈ ఘటన చూసిన జంతు ప్రేమికులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమాయకమైన మూగజీవాలను ఎలా చంపుతారంటూ ప్రశ్నిస్తున్నారు. 

విశ్వాసానికి మారుపేరు గా శున‌కాల‌ను చెబుతారు. ఒక పూట అన్నం పెడితే రోజంతా కాపలా కాస్తాయి. గ్రామంలోకి కొత్తవాళ్లు వస్తే చాలు వారిని చూశి అరుస్తాయి. కాబట్టే వాటిని గ్రామానికి గ్రామ సింహాలుగా పోల్చుకుంటారు. కానీ ఇప్పుడు అలాంటి శున‌కాల‌ను కనికరం లేకుండా లింగపాలెం పంచాయతీ అధికారులు చంపేయడం ఆందోళన కలిగిస్తోంది. అయితే కుక్కలు త‌ర‌చూ దాడులకు తెగబడుతున్నాయ‌ని....ఎక్కడపడితే అక్కడ తిరుగుతున్నాయని అందువల్లే విషం పెట్టి చంపినట్లుగా అధికారులు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: