దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగాను ఉద్దేశించి మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేసారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ గా అడపా శేషగిరిరావు ప్రమాణస్వీకారం సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... పేదరికం లో ఎక్కువగా ఉన్నది కాపు కులం మాత్రమే అని అన్నారు. వంగవీటి రంగా స్థాయిని తగ్గించి కాపు కుల నాయకుడిగా చూపించడం బాగోలేదు అని అభిప్రాయపడ్డారు. రాజకీయ నాయకులు అందరికీ స్ఫూర్తిగావ్యక్తి వంగవీటి రంగా జీవించారని అన్నారు.

ప్రతి ఒక్కరు లౌక్యంగా బతకడం నేర్చుకోవాలి అని సూచించారు. రాజకీయ నాయకులెవరూ కాపు కులాన్నిబాగు చేయలేదన్నారు. కాపు పిల్లలే కాపు కులంని బాగు చేశారు అని ఆయన వ్యాఖ్యానించారు. బెజవాడ వాసి అయినందుకే అడపా శేషగిరిరావు కు కాపు పదవిని జగన్మోహన్రెడ్డి ఇచ్చారు అని వెల్లడించారు. ఏ కులానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంత ప్రాధాన్యత జగన్మోహన్రెడ్డి ఇచ్చారు అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp