కాపు కార్పోరేషన్ చైర్మన్ గా అడపా శేషగిరి రావు ప్రమాణ స్వీకారం సందర్భంగా మంత్రి కురసాల కన్నబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషంగా ఉందన్న ఆయన... కాపు కులంకోసం నిరంతరం పాటుపడ్డ వంగవీటి రంగా ని ఈ సమయంలో గుర్తు చేసుకోవాలన్నారు. సంఖ్యాబలం ఉన్నటువంటి కాపు కులానికి కావలసినటువంటి విద్య, వైద్యం ఏది అందడం లేదు అని వ్యాఖ్యానించారు.

కాపుల ఆత్మాభిమానాన్ని దెబ్బ కొట్టినందుకు చంద్రబాబుకి తగిన శాస్తి జరిగిందని ఓసి లో వెనకబడి ఆర్థికంగా వెనుకబడిన కాపులకు న్యాయం చేస్తాం అని స్పష్టం చేసారు. 10% కాపులకు రిజర్వేషన్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అని గుర్తు చేసారు. ముద్ర పద్మనాభం కుటుంబాన్ని గత ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని మండిపడ్డారు. అందరూ బాగుండాలి అందులో కాపులు ఉండాలి.. ఇదే సిద్ధాంతంతో ముందుకు కొనసాగుతాం అని మంత్రి పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: