గుంటూరు నగరంలో వరుసగా చెయిన్ స్నాచింగ్ లు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు గట్టి నిఘా పెట్టారు. నల్లపాడు స్టేషన్ లిమిట్స్ లోనే ఎక్కువ కేసులు నమోదు అవుతుండటం గమనించిన అర్బన్ ఎస్పీ అరిఫ్, ఆ ప్రాంతంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని సిబ్బందితో కోరగా, ఇటీవల కాలంలో మూడు చెయిన్ స్నాచింగ్ ల్లోనూ వైట్ బైక్ వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. దాని రిజిస్ట్రేషన్ నంబర్స్ తీసుకొని సిసి కెమెరా విజువల్స్ సేకరించి ఇద్దరు చెయిన్ స్నాచర్స్ నిందితులుగా గుర్తించి వారి అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి 64 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఏ1గా ఉన్న పసుపులేటి సాయినాధ్ పై రౌడీ షీట్ ఇప్పటికే కూడా ఉంది. ఈ సందర్భంగా అర్బన్ ఎస్పీ అరిఫ్ హాఫీజ్ నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: