రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారనే కారణంతో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఆ ఏరియా పోలీసులు కేసు నమోదు చేయడం సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది. ఈ మేరకు ఐపీసీ 153A (506) వంటి పలు సెక్షన్స్ ని పేర్కొంటు ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఇక ప్రభాకర్ రెడ్డిపై కేసు పెట్టింది ఒక హెడ్ కానిస్టేబుల్ కావడం విశేషం. పిర్యాదు వచ్చింది కాబట్టి కేసు బుక్ చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. అరెస్ట్ చేయడానికి ముందు భారీ బందోబస్తు మధ్య టీడీపీ పార్టీ కి చెందిన అబ్దుల్‌రహీం తాడిపత్రి మున్సిపాలిటీ కి చెందిన రెండవ వైస్‌ చైర్మన్ ఎన్నికలో విజయం సాధించడంతో కక్ష పూరితంగా కేసు పెట్టినట్టుగా ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసాడు. ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడిన జేసీ, గెలుపు తమదే అంటూ భుజాలు తడుముకున్న వైసీపీ నేతలు చివరికి బొక్కబోర్లా పడ్డారంటూ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

jc