సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య చోటు చేసుకుంది. బీహెచ్ఈఎల్ కాలనీ సమీపంలో రైల్వే ట్రాక్ దగ్గర యువతిని దారుణంగా హత్య చేశారు. 18 ఏళ్ళ వయస్సు ఉన్న డిగ్రీ విద్యార్థిని సరస్వతిని హత్య చేసి చెట్టుకు ఉరి వేసినట్లు  గుర్తించారు పోలీసులు. నిన్న ఉదయం ఇంటి నుంచి సరస్వతి బయటికి వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇక పోలీసుల అదుపులో హత్య చేసిన నిందితుడు ఉన్నట్లు తెలుస్తోంది. 


ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణం అని భావిస్తున్నారు పోలీసులు. నిన్న ఇంటి నుంచి బయటకు వెళ్లిన సరస్వతి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు అల్వాల్ పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తుండగా రైల్వే ట్రాక్ పక్కన యువతి మృతదేహం కనిపించింది. అటు వెళుతున్న స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: