విపక్ష సభ్యులు అందరికీ టీ పార్టీ తర్వాత, ఇప్పుడు రాహుల్ పార్లమెంట్ వరకు సైకిల్ మార్చ్ చేస్తున్నారు. ఆయనతో పాటు, అనేక మంది నాయకులు కూడా సైకిల్ తొక్కుతూ పార్లమెంట్ కి బయలుదేరారు. కాంగ్రెస్ నేతృత్వంలోని అనేక ప్రతిపక్ష పార్టీలు పెగాసస్ గూఢచర్యం కేసు మరియు ఇతర సమస్యల పై చర్చించాలని కోరుతున్నాయి. ప్రతిపక్ష ఐక్యతను ప్రదర్శిస్తూ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో సహా పలువురు ప్రతిపక్ష నాయకులు మంగళవారం సైకిల్‌పై పార్లమెంట్‌కు చేరుకున్నారు.



 ప్రతిపక్ష ఐక్యతను బలోపేతం చేయడానికి, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మంగళవారం రాజకీయ పార్టీల ఎంపీలను అల్పాహారం కోసం పిలిచారు. ఈ సమావేశంలో, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రతిపక్ష పార్టీలు తమలో తాము వాదించుకోవచ్చు కానీ పెట్రోల్ మరియు డీజిల్ సమస్యపై మనమందరం గొంతు పెంచాలి, ఇక్కడ నుండి పార్లమెంట్ వరకు సైకిల్ మార్చ్ చేయాలని పిలుపునివ్వడంతో వారంతా అలానే సైకిల్ మీద పార్లమెంట్ కి వెళ్లారు.

మరింత సమాచారం తెలుసుకోండి: