సామాజిక మాధ్యమాల విషయంలో ప్రజలు జాగ్రత్తగా లేకపోతే మాత్రం అనవసరంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. తాజాగా కృష్ణా జిల్లా గన్నవరంలో ఒక వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గన్నవరం వెటర్నరీ కళాశాలలో చదువుతున్న కోట శంకర్ ను ఫేస్బుక్ వేదికగా చేసుకొని ఇద్దరు వ్యక్తులు అతని బంగారం దొంగతనం చేసారు. స్నేహపూర్వకంగా కలవాలని ఎవరు తిరగని ప్రదేశానికి కోట శంకర్ ను పిలిచారు.

కోట శంకర్ రాగానే బెదిరించి అతని వద్దనున్న మూడు కాసులు బంగారం. సెల్ ఫోన్ తీసుకొని పరారు అయ్యారు. గన్నవరం పోలీసులను ఆశ్రయించిన శంకర్... జరిగిన విషయాన్ని చెప్పాడు. రంగంలో దిగిన క్రైమ్ పోలీసులు నిందితులను గుర్తించారు. గన్నవరం మండలం వీరపనేనిగూడెం. దుర్గాపురం గ్రామాలకు చెందిన జితేంద్ర కుమార్ నాయక్ అలాగే సంపత్ లగా గుర్తించారు. ఇద్దరు వ్యక్తులను ఈ రోజు కోర్టులో ప్రవేశపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: