జ‌మ్మూకాశ్మీర్ లో ఆర్మీ హెలికాప్ట‌ర్ ఒక్క‌సారిగా కుప్ప‌కూలిపోయింది.  మంగ‌ళ‌వారం క‌థువాలోని రంజిత్ సాగ‌ర్ డ్యామ్ వ‌ద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ హెలికాప్ట‌ర్ ఎటువైపు వెళుతుంది..? ఇందులో ఎవ‌రెవ‌రు ఉన్నార‌న్న వివ‌రాలు ఇంకా తెలియ‌లేదు. ప్ర‌స్తుతం రెస్య్కూ టీమ్ సంఘ‌ట‌నా స్థలానికి చేరుకుంది. ఎన్టీఆర్ ఎఫ్ మ‌రియు ఎస్డీఆర్ ఎఫ్ బృందాలు స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ప్రారంభించారు. 

ఆర్మీ హెలికాప్టర్‌ డ్యామ్‌లో కూలిపోయినట్టు త‌మ‌కు సమాచారం అందిందని రక్షణ బృందాలను ఘటనా స్థలానికి తరలించామని పంజాబ్‌లోని పఠాన్‌కోట్ సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ సురేంద్ర లంబా మీడియాకు తెలిపారు. ఈ డ్యామ్ పంజాబ్ ప‌ఠాన్ కోట్ కు 30కిమీల దూరంలో ఉందని వెల్ల‌డించారు. ప్రాణ న‌ష్టం జ‌రిగిన‌ట్టు ఎలాంటి నివేధిక‌లు లేవ‌ని స‌హాయ‌క చ‌ర్య‌లు ఇప్ప‌టికే ప్రారంభించామ‌ని వెల్ల‌డించారు. స‌హాయ‌క చ‌ర్య‌లు పూర్తి అయ్యాక దీని పై మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: