మహబూబ్ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. ట్రైనీ ఎస్సై పై స్థానిక ఎస్ఐ బ‌లాత్కారానికి పాల్పడ్డాడు. మరిపెడ ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరెడ్డి  మహిళా ట్రైనీ ఎస్ఐని నిన్న రాత్రి అడవికి తీసుకెళ్లి బ‌లాత్కారం చేశాడు. దాంతో న్యాయం కోసం బాధితురాలు వరంగల్ సిపి కార్యాలయానికి చేరుకుంది. బాధితురాలితో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా సీపీ కార్యాలయానికి చేరుకున్నారు. దళిత యువ‌తి కావడమే ట్రైనీ ఎస్సై చేసుకున్న పాపమా అని కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. 

ఈ ఘటనపై తనకు న్యాయం జరగకపోతే వెంటనే రాజీనామా చేస్తానని ట్రైనీ ఎస్ఐ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం బాధితురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి వ‌రంగల్ సి పి కార్యాలయంలో ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి సాధారణ మహిళలకు కష్టం వస్తే పోలీసులు గుర్తు వస్తారు. కానీ ఓ మహిళ ట్రైనీ ఎస్సై కే ఇప్పుడు ర‌క్ష‌ణ లేకుండా పోయింది. ఇక‌ శ్రీనివాస్ రెడ్డిని వెంటనే శిక్షించాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: