మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకి సంబంధించి తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేసారు. నేడు మీడియాతో మాట్లాడిన ఆయన... వైయస్ వివేకానంద రెడ్డి హత్య విషయం జగన్మోహన్ రెడ్డికి వాస్తవం తెలుసు కాబట్టే ఆనాడు కేసు విచారణ జరుపుతున్న అభిషేక్ మహంతి సెలవు పెట్టి వెళ్లిపోవాల్సి వచ్చింది అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు సిబిఐ అధికారి సుధా సింగ్ కూడా ఇదే కారణంతోనే విచారణ నుంచి తొలగించారు అని అన్నారు.

ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్ వీరే హత్య చేసి ఉంటే నేరుగా జగన్మోహన్ రెడ్డి కి కానీ వివేకానంద రెడ్డి కూతురు సునీత రెడ్డికి కానీ రంగయ్య చెప్పి ఉంటే సమస్య పరిష్కారం అయ్యేది కదా అని అన్నారు. ఈ విషయం రంగయ్య చెప్పే దానికి రెండు సంవత్సరాలు పట్టిందా అంటూ ప్రశ్నించారు. వివేకానంద రెడ్డి ని చంపిన హంతకులు ఎవరో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి తెలుసని అన్నారు. వందకు వందశాతం జగన్మోహన్ రెడ్డికి తెలిసే హత్యకు సంబంధించిన వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: