వరస ఒలంపిక్స్ లో పథకాలు సాధించిన తెలుగు తేజం పీవీ సింధు ఇండియాకు చేరుకుంది. టోక్యో ఒలంపిక్స్ లో సాధించిన కాంస్య పతకం తో ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో అడుగు పెట్టింది. ఈ రోజు సాయంత్రం కేంద్ర మంత్రులు అలాగే ప్రధాని మోడీ ని పీవీ సింధు కలవనున్నారు.  క్రీడా శాఖ ఉన్నతాధికారులు సింధు కు ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం పలికారు. ఇక ఇప్పటికే 2016 రియో ఒలంపిక్స్ లో రజత పతకం సాధించిన సింధు 2019 టోక్యో లో కాంస్యం సాధించి వరస ఒలంపిక్స్ లో మెడల్స్ గెలిచినా తొలి భరత్ మహిళా గా చరిత్ర సృష్టించింది. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కి ఆమె అభిమానులు పెద్ద ఎత్తున చేరుకొని ఆమెకు స్వాగతం పలికారు. టోక్యో ఒలంపిక్స్ లో మెడల్స్ సాధించిన క్రీడాకారులంతా కూడా ఆగష్టు 15 వేడుకలకు హాజరు కానుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: