రేవంత్ టాక్స్ : ఎంపీ సంతోష్ బీజేపీ ఏజెంటా?

రెండంటే రెండు
టీఆర్ఎస్ బీజేపీ
దొందూ దొందే
అని రేవంత్ ఆరోపిస్తూ

 
ఎంపీ సంతోష్
 
బీజేపీ ఏజెంట్ అని
అభియోగం చేస్తూ
పీసీసీ చీఫ్ మాట్లాడారు
ఆ వివ‌రం ఈ సంక్షిప్త వార్త‌లో

 

ఇవాళ ఢిల్లీ కేంద్రంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు.తెలంగాణ ఎంపీల‌ను టార్గెట్ చేసుకుని కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశా రు. వీళ్లెవ్వ‌రూ పార్ల‌మెంట్ లో ప్ర‌జా స‌మస్య‌ల‌పై మాట్లాడ‌డం లేద‌ని మండిప‌డ్డారు.తాము ప్ర‌ జాపోరాటం చేస్తుంటే క‌నీసం పార్ల మెంట్ లో మాట్లాడ‌డం వీరికి చేత‌గావ‌డం లేద‌ని అన్నారు.అదేవిధంగా బీజేపీ,టీఆర్ఎస్ బొమ్మా బొరుసూలాంటివి అని అన్నారు. వీరంతా ఒ క‌రికొక‌రు ర‌హ‌స్య ఒప్పందాలు చేసుకుంటు న్నార‌ని ఆరోపించారు.కేసీఆర్ కు స‌న్నిహితుడైన సంతోష్ కుమార్ పీఎం మోడీతో రహ స్యంగా భేటీ అయ్యార‌ని,ఇదొక్క‌టీ చాలు అని ఆ రెండు పార్టీల మ‌ధ్య స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయ‌నేందుకు అని పేర్కొంటూ... టీ ఆర్ఎస్ ఎంపీల తీరుపై మండిప‌డ్డారు. కేసీఆర్ ఫ‌క్తు మోడీ మ‌నిషి అని ఇదంతా ఆయ‌న క‌నుస‌న్న‌ల్లో న‌డుస్తు న్న ప‌రిణామం అని అన్నారు.తాజా ప‌రిణామాలను చూస్తే ఏనాడూ టీఆర్ఎస్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌నూ లేవ‌నెత్త‌లేద‌ ని మండిపడ్డారు. కేసీఆర్ ఒత్తిడి కార‌ణంగానే బండి సంజ‌య్ త‌న పాద‌యాత్ర‌ను వాయిదావేసుకున్నార‌ని కూడా అభియోగం చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: