తెలుగు దేశం పార్టీ అఫిషియల్ ట్విట్టర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనపై విమర్శలు గుప్పించారు.
నాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పారిశ్రామిక సదస్సులు పెట్టారని, తద్వారా ప్రసిద్ధ కంపెనీలను రాష్ట్రానికి తెచ్చి యువతకు 5 లక్షల ఉద్యోగాలను సృష్టించారని గుర్తు చేశారు. నాడు చంద్రబాబు పై విష ప్రచారం చేసిన జగన్, నేడు అధికారంలోకి వచ్చి తన కక్ష సాధింపు వైఖరితో కంపెనీలు రాష్ట్రాలు వదిలి వెళ్లిపోయేలా చేస్తున్నారంటూ మండిపడ్డారు. నాడు నీవు చెప్పిన మాటలు నీకే వర్తిస్తున్నాయి జగన్ రెడ్డి అంటూ సెటైరికల్ ట్వీట్ చేశారు. అంతేకాదు దేవుడు స్క్రిప్ట్ భలే రాసాడుగా అంటూ ఆ ట్వీట్ ను ఎండ్ చేశారు.


ఈ మేరకు ఓ ప్రసిద్ధ తెలుగు ఛానల్ లో ప్రసారమైన కథనాన్ని ట్విట్టర్లో షేర్ చేశారు. అందులో జగన్ సర్కారు రాజకీయ కక్షను భరించలేక అత్యంత ప్రతిష్టాత్మకమైన అమరరాజా బ్యాటరీస్ సంస్థ మొత్తం ప్లాంటునే మరో రాష్ట్రానికి తరలించాలని భావిస్తోంది అంటూ ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: