అనంతపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సింగనమల నియోజకవర్గ ఇన్చార్జి బండారు శ్రావణి శ్రీ ఆందోళనకు దిగడం ఇప్పుడు సంచలనం అయింది. సింగనమల నియోజకవర్గం లో 2 మెన్ కమిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తు బండారు శ్రావణి వర్గీయులు నిరసనకు దిగారు. అధిష్టానం నిర్ణయం మార్చుకోకపోతే రాజీనామా చేస్తామని హెచ్చరికలు చేయడం ఇప్పుడు సంచలనం అయింది.

ఎస్సీ నియోజకవర్గంలో ఓసీ ల పెత్తనం ఏంటి అని మండిపడుతున్న నియోజకవర్గ  నేతలు... అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులుతో వాదనకు దిగిన బండారు శ్రావణి వర్గీయులు... ఇలాంటి చర్యలు ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ కార్యాలయానికి పోలీసులు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ కార్యాలయం నుంచి  టీడీపీ నేతలు కార్యకర్తలను బయటికి పంపుతున్న పోలీసులు... అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: