తెలంగాణాలో జరిగిన చిన్నారి అత్యాచార ఘటనపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. తాజాగా దీనిపై బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ పోలీసులపై రాజసింగ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ గడ్డ ‌... రేప్ లకు అడ్డాగా మారిందని విమర్శలు చేసారు ఆయన. ప్రజల భద్రత కాదు.. పోలీస్ బాస్ ల ప్రాధాన్యతలు వేరే ఉన్నాయి అని అన్నారు ఆయన.

కొందరు పోలీస్ అధికారులు ప్రమోషన్ల‌ కోసం అధికార పార్టీకి గులాంగిరీ చేస్తున్నారు అని ఈ సందర్భంగా మండిపడ్డారు. హుజూరాబాద్ మాత్రమే కాదు.. అన్ని ప్రాంతాలపై ముఖ్యమంత్రి దృష్టి సారించాలి అని సూచించారు. లా అండ్ ఆర్డర్ లో తెలంగాణ పోలీసులు విఫలం అని రాజా సింగ్ విమర్శించారు. నైట్ పెట్రోలింగ్ ను సైతం పోలీసుల సక్రమంగా నిర్వహించటం లేదు అన్నారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp