తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే ,మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఇంటి గేటు వరకు వెళ్లడం దారుణం అని ఆరోపించారు. జెడ్ కేటగిరి భద్రత ఉన్న ఇంటి వద్దకు వెళ్లడం అవసరమా అని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఎక్కడికి పోతుందో అర్థం కావడం లేదు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.

జగన్మోహన్ రెడ్డి ఎల్లకాలం ముఖ్యమంత్రి సీట్లో కూర్చొలేరు అన్నారు ఆయన. అందరూ మీ తీరుపట్ల అసంతృప్తిగా ఉన్నారు... ఇలాంటివి మరోసారి జరగకుండా చూసుకోండి అని సూచించారు.14 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తి కె భద్రత లేకుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. కాగా చంద్రబాబు ఇంటిపై దాడి జరిగిన నేపధ్యంలో అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున టీడీపీ నేతలు రోడ్ల మీదకు వచ్చి నిరసన చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

jc