ఆంధ్ర ప్రదేశ్ లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి, రేపు ఉదయం 8 గంటలకు పరిషత్ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. రేపు 13 జిల్లాల్లో 206 కేంద్రాల్లో పరిషత్ ఓట్ల లెక్కింపు జరగనుంది,  ఓట్ల లెక్కింపునకు వీలుగా 206 కేంద్రాల్లో 958 హాళ్ల ఏర్పాటు చేసారు అధికారులు. జిల్లాల వారీగా ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి కాగా పరిశీలకులుగా ఐఏఎస్ అధికారులు ఉండనున్నారు. ఇప్పటికే కలెక్టర్లు, అధికారులను సమాయత్తం చేసిన ఎస్‍ఈసీ , లెక్కింపు కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా బందోబస్తు చూసుకోవాలని ఆదేశించింది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు అమలులో ఉండాలని అంటున్నారు, విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీచేశారు. గత ఎన్నికల సరళి పరిశీలిస్తే అధికార పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: