కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో చర్చనీయాంశంగా మారిన సైదాబాద్ ఆరేళ్ల పాప అత్యాచారం హత్య కేసులో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు, ఈ కేసు తర్వాత జరిగిన పరిణామాల ప్రకారం సైదాబాద్ కాలనీ వాసులు మీద ఇప్పుడు కేసులు పెట్టారు. సింగరేణి కాలనీ స్థానికుల పై కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ నెల 10న పోలీసుల విధులకు ఆటంకం కలిగించేలా చేసిన పలువురు పై కేసులు నమోదు చేసినట్లు చెబుతున్నారు. చిన్నారి మృతదేహాన్ని తరలించే సమయం లో పోలీసులను స్థానికులు అడ్డుకోవడమే కాక ఆరోజు విధుల్లో ఉన్న పోలీసులు పై స్థానికులు  రాళ్లు కూడా రువ్వినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పలువురు మహిళా పోలీస్ సిబ్బందికి గాయాలు కూడా అయ్యాయని అంటున్నారు, ఈ క్రమంలో ఈ ఘటనపై సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: