ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో ఓ వ్యక్తి అత్యంత దారుణ హత్యకు గురైన ఘటన సంచలనంగా మారింది, జంగారెడ్డిగూడెంలో మునసబుగారి వీధిలో అర్ధరాత్రి మోడల్ డెయిరీ డిస్ట్రిబ్యూటర్ సురేష్ మీద హత్య ప్రయత్నం జరిగింది. ఒక గుర్తు తెలియని వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో సురేష్ తీవ్రంగా గాయపడ్డాడు, వెంటనే అతన్ని పోలీసులు 108 లో ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే, పరిస్థితి మరింత విషమించడంతో అక్కడి నుంచి విజయవాడ ఆస్పత్రికి తరలించగా విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సురేష్ మరణించాడు. ఓ అక్రమ సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మోడల్ డెయిరీలో పనిచేస్తున్న ఓ అమ్మాయితో సురేష్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, ఆ అమ్మాయికి సంబంధించిన వ్యక్తి ఈ హత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: