నటుడు రియ‌ల్ హీరో సోనూసూద్ 20 కోట్ల ప‌న్ను ఎగ్గొట్టిన‌ట్టు ఆదాయ‌శాఖ దృవీక‌రించింది. వ‌రుస‌గా మూడు రోజుల నుండి సోనూ సూద్ ఇల్లు మ‌రియు ముంబై లోని ఆఫీసుల‌పై ఐటీశాఖ దాడులు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల సోనూసూద్ ను ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ ఓ కార్య‌క్ర‌మానికి బ్రాండ్ అంబాసిడ‌ర్ గా నియ‌మించారు. దాంతో ఐటీశాఖ సోనూసూద్ ఇల్లు మ‌రియు ఆఫీసుల‌పై వ‌రుస‌గా మూడు రోజుల నుండి దాడులు చేస్తుంది. ఇక ఈరోజు సోనూసూద్ ప‌న్ను ఎగవేత‌ల‌కు పాల్ప‌డినట్టు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. 

సోనూసూద్ రూ.2 కోట్ల వ‌ర‌కూ విదేశీ నిధులు వ‌చ్చిన‌ట్టు వాటికి సంబంధించి స‌రైన పత్రాలు లేన‌ట్టుగా నిర్ధారించింది. అంతే కాకుండా 20 కోట్ల ప‌న్ను ఎగ్గొట్టిన‌ట్టు ఐటీశాఖ నిర్థారించింది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కోసం ఒక ప్రోగ్రాంకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించ‌డం.. చదువు ప్రోత్సహించే విషయంలో అంబాసిడ‌ర్ గా నియ‌మించ‌డం కార‌ణంతోనే అప్పటి నుంచి సోనూను టార్గెట్ చేశార‌ని ఆయ‌న అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: