తన రాజీనామా కోరడానికి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎవరు? అని ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్పై ఆయన వ్యాఖ్యలు సరిగా లేవని, ప్రజల తీర్పును తెలుగుదేశం పార్టీ నేతలు గౌరవించడంలేదన్నారు. తాడేపల్లిలో శనివారం మీడియాతో మాట్లాడిన సుచరిత అయ్యన్నపాత్రుడు వాడుతున్న భాష సరిగా లేదని, తెలుగుదేశం పార్టీ హయాంలోనే వంగవీటి రంగా హత్య జరిగిందని, అప్పుడు శాంతిభద్రతలు గుర్తుకురాలేదా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్పై కోడికత్తితో దాడి జరిగితే ఎగతాళి చేశారని, తాను రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేయడానికి అయ్యన్నపాత్రుడు ఎవరని, ముఖ్యమంత్రి జగన్ కోరితే తక్షణం రాజీనామా చేస్తానని సుచరిత స్పష్టం చేశారు. దళిత మహిళను హోంమంత్రిని చేస్తే మీకు ఎందుకు కడపు మంటగా ఉందని, తెలుగుదేశం హయాంలో మహిళకు ఎటువంటి న్యాయం జరిగిందని, చంద్రబాబుకు మహిళలపై గౌరవం ఉంటే అయ్యన్నపాత్రుడిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
తన రాజీనామా కోరడానికి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎవరు? అని ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్పై ఆయన వ్యాఖ్యలు సరిగా లేవని, ప్రజల తీర్పును తెలుగుదేశం పార్టీ నేతలు గౌరవించడంలేదన్నారు. తాడేపల్లిలో శనివారం మీడియాతో మాట్లాడిన సుచరిత అయ్యన్నపాత్రుడు వాడుతున్న భాష సరిగా లేదని, తెలుగుదేశం పార్టీ హయాంలోనే వంగవీటి రంగా హత్య జరిగిందని, అప్పుడు శాంతిభద్రతలు గుర్తుకురాలేదా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్పై కోడికత్తితో దాడి జరిగితే ఎగతాళి చేశారని, తాను రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేయడానికి అయ్యన్నపాత్రుడు ఎవరని, ముఖ్యమంత్రి జగన్ కోరితే తక్షణం రాజీనామా చేస్తానని సుచరిత స్పష్టం చేశారు. దళిత మహిళను హోంమంత్రిని చేస్తే మీకు ఎందుకు కడపు మంటగా ఉందని, తెలుగుదేశం హయాంలో మహిళకు ఎటువంటి న్యాయం జరిగిందని, చంద్రబాబుకు మహిళలపై గౌరవం ఉంటే అయ్యన్నపాత్రుడిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.