భ‌ర్త పై కుటుబంతో క‌లిసి ఓ భార్య నిప్పంటించింది. ఈ ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయ‌ప‌డిన భ‌ర్త ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. చికిత్స పొందుతున్న క్ర‌మంలో త‌న భార్య మ‌రియు ఆమె కుటుంబం క‌లిసి కిరోసిన్ పోసి నిప్ప‌టించారని తెలిపాడు. ఈ ఘ‌ట‌న మ‌ధ్య ప్ర‌దేశ్ లోని సాగ‌ర్ జిల్లాలో చోటు చేసుకుంది. భార్య ఆమె కుటుంబంలోని మ‌రో ముగ్గురు క‌లిసి భ‌ర్త‌పై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ ఘ‌ట‌న‌లో భార్య‌కు కూడా నిప్పు అంటుకుంది.

దాంతో ఆమెకు కూడా కొన్ని గాయాల‌య్యాయి. ఇక భ‌ర్త తీవ్రంగా గాయ‌ప‌డ‌గా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించాడు. సాగ‌ర్ ఎస్పీ అతుల్ సింగ్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం...భార్య కుటుంబ స‌భ్యులు కిరోసిన్ పోసి నిప్పంటించ‌డంతో భ‌ర్త మృతి చెందాడ‌ని వెల్లడించారు. భార్య‌పై భ‌ర్త ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకుని క‌స్ట‌డికీ త‌ర‌లించామ‌ని తెలిపారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: