అనంతపురం జిల్లాలో దారుణ ఘటన జరిగింది. నల్లమడ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన విగ్నేష్ అనే పన్నెండేళ్ల బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ నెల 12న విగ్నేష్ ను కిడ్నాప్ చేసిన గ్రామానికి చెందిన కొంతమంది యువకులు అతన్ని హత్య చేసాడు. పోలీసులకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేసారు. ఆచూకీ కోసం గాలించగా వారం రోజుల తర్వాత కమ్మవారిపల్లి సమీపంలోని ఓ పాడుబడిన బావిలో శవమై తేలాడు.

గ్రామానికి చెందిన కొంతమంది యువకులు కిడ్నాప్ చేసి చంపారని పోలీసులకు తల్లి తండ్రులు ఫిర్యాదు చేసారు. గ్రామంలోనే రైస్ మిల్లు నడుపుతున్న విగ్నేష్ తండ్రి చంద్రకు మరికొందరికి విభేదాలు ఉన్నట్టు గుర్తించారు. రైస్ మిల్లులో పని చేస్తున్న చిన్న చౌడప్పను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అప్పగించాలంటూ గ్రామస్థులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: