నాగ చైతన్య హీరోగా రాబోతున్న 'లవ్ స్టోరీ' సినిమాపై అక్కినేని ఫ్యాన్స్ చాలా అంచనాలు పెట్టుకున్నారు, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ లవ్ స్టోరీ సినిమాలో నాగ చైతన్య జంటగా సాయి పల్లవి నటించింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థల సంయుక్త సమర్పణలో కె నారాయణదాసు నారంగ్, పి. రామ్మోహన్ రావు పుష్కర్ లు నిర్మాతలుగా వ్యవహరించారు. సెప్టెంబర్ 24వ తేదీన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్న యూనిట్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసింది, ఈ ఈవెంట్‌కి ఇద్దరు స్పెషల్ గెస్టులను ఆహ్వానించిందని ప్రచారం జరుగుతూ వచ్చింది. ఈరోజు సాయంత్రం ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనుండగా ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున హాజరు కానున్నారని ప్రచారం జరుగుతూ ఉండగా ఇప్పుడు చైతూ కోసం ఒక బాలీవుడ్ స్టార్ అదేనండీ చైతూతో  లాల్ సింగ్ చద్దాలో కలిసి నటించబోతున్న అమీర్ ఖాన్ రానున్నారని అంటున్నారు, అక్కినేని ఫ్యాన్స్ ఎప్పటికీ గుర్తుంచుకునేలా చాలా గ్రాండ్‌గా ఈ ఈవెంట్ జరగనుందని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: