పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం గురుభట్ల గూడెం గ్రామంలో నిన్న రాత్రి  పిడుగు పడి పలు ఇళ్లు దగ్ధం అయ్యాయి, ఒక ఇంట్లో ఉన్న 20 లక్షల రూపాయల నగదు దగ్ధం అయిందని అంటున్నారు. పొలం అమ్మి అగ్రికల్చర్ బీఎస్సీ చదవడానికి మహేష్ అనే విద్యార్థి 20 లక్షలు సిద్ధం చేసుకున్నట్లు చెబుతున్నారు, డబ్బంతా కాలిపోవడంతో మహేష్ కన్నీరుమున్నీరు అవుతున్నారు. అందుతున్న సమాచారం మేరకు పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం గురుభట్ల గూడెం శివాలయం వీధిలో కాళ్ల కృష్ణవేణి కొడుకు మహేష్ తో కలిసి నివాసముండేవారు, కొడుకు భవిష్యత్తు బాగుండాలని ఆ తల్లి ఎంతో కష్టపడి చదివించింది, అయితే అగ్రికల్చర్ బీఎస్సీ చదవాలని భావించిన కొడుకు కోసం వెనకాముందు ఆలోచించకుండా ఆ తల్లి జీవనాధారం అయిన వ్యవసాయ భూమిని అమ్మేసి ఆ భూమి అమ్మగా వచ్చిన రూ.20 లక్షలు ఇంట్లో భద్రపరిచారు, పిడుగు పడడంతో ఇంటితో పాటు ఆ డబ్బు కూడా కాలి ళీ బూడిదయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: