అనంతపురం జిల్లా హిందూపురంలో వైసీపీ రంగుల మాస్క్ తో కౌంటింగ్ హాల్ కు ఏజెంట్లు రావడం సంచలనంగా మారింది, ఎంజీఎం హై స్కూల్ లో జరుగుతున్న హిందూపురం జెడ్ పి టి సి కౌంటింగ్ కి హిందూపురం మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఇలియాజ్ ఏజెంట్ గా హాజరయ్యారు. అయితే ఆయన వైసీపీ పార్టీ రంగులతో కూడిన మాస్క్ వేసుకున్నా కౌంటింగ్ హాల్లోకి అధికారులు అనుమతించినట్లు చెబుతున్నారు, మీడియా కంట పడటంతో మాస్క్ ను తీసివేసిన ఇలియాజ్ మరో మాస్క్ వేసుకున్నారని అంటున్నారు. సాధారణంగా ఎన్నికల సమయంలోనే కాక కౌంటింగ్ సమయంలో కూడా పార్టీ గుర్తులు ఉన్న బట్టలు కానీ, పార్టీ జెండా రంగులు ఉన్న బట్టలు కానీ వేసుకుని ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న చోటికి వెళ్ళకూడదు, కానీ అధికార పార్టీ నేత కావడంతోనే అతనిని లోపలికి వదిలారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: