మన తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. హైదరాబాద్ లో అయితే వేడుకల విషయంలో చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వినాయకుడి వేడుకలకు విదేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు. ఖైరతాబాద్ అయినా బాలాపూర్ అయినా సరే క్రేజ్ ఒక రేంజ్ లో ఉంటుంది. బాలాపూర్ లడ్డు కోసం పెద్ద ఎత్తున పోటీ పడుతూ ఉంటారు.

తాజాగా బాలాపూర్ లడ్డూ కి వేలం పాత నిర్వహించారు. దాదాపుగా 19 లక్షలు పలికింది ఈ లడ్డు. 18 లక్షల 90 వేల రూపాయలకు మర్రి శశాంక్ రెడ్డి  అనే వ్యక్తి సొంతం చేసుకున్నారు. ఈ లడ్డూ రికార్డ్ ధర పలకడం తో నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తో కలిసి ఆయన లడ్డూ కొనుగోలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: