ఏపీ ప్రభుత్వ సమాచార శాఖ అధికారులకు షాక్ తగిలింది, సెల్ ఫోన్ బిల్లులు చెల్లించలేదని I&PR(సమాచార శాఖ) ఫోన్ సర్వీస్ లను సర్వీస్ ప్రొవైడర్ నిలిపి వేసింది. ఈ దెబ్బతో ఫోన్లు పని చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సమాచార శాఖ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు, ఈ రోజు అసలే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ కూడా జరుగుతోంది, ఈ కౌంటింగ్ ప్రక్రియ నేపథ్యంలో ఫోన్స్ సర్వీస్ నిలిపివేయడంతో సమాచార శాఖ అధికారులు సతమతమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో కొన్ని వారాలుగా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని అంటున్నారు. ఇక మరో పక్క ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా  ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ మొదలయింది, ఈరోజు సాయంత్రం వరకు ఈ ఎన్నికల ప్రక్రియ సాగనుంది, అయితే గత ఎన్నికలలో లానే ఈ ఎన్నికల్లో కూడా వైసీపీ సత్తా చాట్ అవకాశం కనిపిస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: