ఆంధ్రప్రదేశ్ లో అత్యాచారాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా వ్యవహరిస్తుంది. సిఎం వైఎస్ జగన్ నుంచి మంత్రులు అందరూ అత్యాచారానికి పాల్పడే వారి విషయంలో కఠిన చర్యలు ఉంటాయని చెప్తున్నారు. అయినా సరే కొందరిలో మాత్రం మార్పు కనపడటం లేదు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక దారుణ ఘటన జరిగింది. వీరవాసరం మండలం అండలూరు లో దారుణం చోటు చేసుకుంది.

9 ఏళ్ల మైనర్ బాలికపై వరుసకు బావ ప్రశాంత్ కుమార్ లైంగిక దాడి చేయడం సంచలనం అయింది.  పదిరోజుల క్రితం ఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. ఆలస్యంగా వెలుగు చూసిన సంఘటనపై పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు. పోక్సో  కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భయంతో పురుగులమందు తాగి నిందితుడు  ఆత్మహత్యాయత్నం   చేయబోయినట్టుగా తెలుస్తుంది. భీమవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap