క‌డ‌ప‌ జిల్లా ప్రొద్దుటూరు తెదేపా నేత నందం సుబ్బ‌య్య హ‌త్య కేసులో రేపు ఢిల్లీలో విచార‌ణ జరగనుంది, బీసీ జాతీయ క‌మిష‌న్ స‌భ్యుడు ఆచారి త‌ల్లోజు విచార‌ణ చేప‌ట్టనున్నారు. విచార‌ణ‌కు హాజరు కావాల‌ని  క‌ర్నూలు రేంజ్‌ డీఐజి, క‌డ‌ప ఎస్పీల‌కు బీసీ జాతీయ క‌మిష‌న్‌ నోటీసు జారీ చేసింది. 24న దిల్లీలో జ‌రిగే విచార‌ణకు హాజ‌రు అవుతానని నందం సుబ్బ‌య్య భార్య అప‌రాజిత‌ పేర్కొన్నారు, అన్ని ఆధాలు బీసీ జాతీయ క‌మిష‌న్‌కు స‌మ‌ర్పిస్తానని అప‌రాజిత‌ పేర్కొన్నారు. ఈ కేసులో ప్రొద్దుటూరు ఎమ్యెల్యే బావ‌మ‌రిది బంగారు ముని రెడ్డి, అప్ప‌టి క‌మిష‌న‌రు రాధ పేర్ల‌ను చేర్చాలని అప‌రాజిత‌ డిమాండ్ చేస్తున్నారు. వారి పేర్ల‌ను కేసులో చేర్చేంత వ‌ర‌కూ పోరాటం ఆప‌నని అప‌రాజిత తెగేసి చెబుతున్నారు, మరి ఈ కేసు ఎందాకా వెళ్లనుంది అనేది ఆసక్తికరంగా మారింది, చూడాలి ఎం జరగనుందో?

మరింత సమాచారం తెలుసుకోండి: