మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మురుగుడు పార్టీ అధిష్టానానికి పంపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తనను సరిగా ఉపయోగించుకోలేదని, తనకు పార్టీ టిక్కెట్ ఇస్తానని ఇవ్వలేదని ఆరోపించారు. త్వరలో భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని మురుగుడు హనుమంతరావు చెప్పారు. ఆయన అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని మురుగుడు అనుచరులు చెబుతున్నారు. మరోవైపు తెలుగుదేశం నాయకులు మురుగుడు హనుమంతరావుపై విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ టికెట్ ఇస్తామని ఏనాడూ హామీ ఇవ్వలేదని, అధికార పార్టీతో లోపాయికారీగా స్నేహం చేస్తూ గత ఎన్నికల్లో కూడా సహకరించలేదని మండిపడుతున్నారు. హనుమంతరావు రాకవల్ల పార్టీకి ఒరిగింది ఏమీ లేదని, బలోపేతమయ్యే సంగతి పక్కనపెడితే పార్టీని బలహీనపరిచేలా వ్యవహరించారంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఆయనవల్ల ఎటువంటి ఉపయోగడం ఉండదని, వైసీపీలో కూడా చేర్చుకోవద్దని కోరుతున్నారు.
మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మురుగుడు పార్టీ అధిష్టానానికి పంపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తనను సరిగా ఉపయోగించుకోలేదని, తనకు పార్టీ టిక్కెట్ ఇస్తానని ఇవ్వలేదని ఆరోపించారు. త్వరలో భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని మురుగుడు హనుమంతరావు చెప్పారు. ఆయన అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని మురుగుడు అనుచరులు చెబుతున్నారు. మరోవైపు తెలుగుదేశం నాయకులు మురుగుడు హనుమంతరావుపై విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ టికెట్ ఇస్తామని ఏనాడూ హామీ ఇవ్వలేదని, అధికార పార్టీతో లోపాయికారీగా స్నేహం చేస్తూ గత ఎన్నికల్లో కూడా సహకరించలేదని మండిపడుతున్నారు. హనుమంతరావు రాకవల్ల పార్టీకి ఒరిగింది ఏమీ లేదని, బలోపేతమయ్యే సంగతి పక్కనపెడితే పార్టీని బలహీనపరిచేలా వ్యవహరించారంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఆయనవల్ల ఎటువంటి ఉపయోగడం ఉండదని, వైసీపీలో కూడా చేర్చుకోవద్దని కోరుతున్నారు.