ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ సర్కార్ కు ఈ మధ్య  కోర్టుల నుంచి వరుస ఇబ్బందులు ఎదురవుతున్నాయి, తాజాగా సుప్రీంకోర్టులో చుక్కెదురు అయింది. ఆంధ్ర ప్రదేశ్  హైకోర్టు ఆదేశాలను   అమలు చేయనందుకు గాను ఆంధ్ర ప్రదేశ్   ప్రభుత్వానికి రూ. 1 లక్ష జరిమానా విధించింది. దేవి సీ ఫుడ్ లిమిటెడ్ కేసులో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకుండా సుప్రీంకోర్టు ను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆశ్రయించింది, దీంతో .హై కోర్టు ఆదేశాలను సుప్రీం కోర్టులో సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వానికి షాకిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిజానికి హైకోర్టు ఆదేశాలు అమలు చేయకుండా దిక్కరణ మినహాయింపు ఇవ్వాలని న్యాయస్థానాన్ని ప్రభుత్వం కోరింది, ఈరోజు ఈ కేసు సుప్రీంకోర్టు విచారణ జరిపింది, విచారణ అనంతరం ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు రూ. లక్ష జరిమానా విధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: