గుంటూరు జిల్లా కొప్పర్రు హింసా ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా ఈ ఘటన మీద డీజీపీ కి చంద్రబాబు లేఖ రాశారు, ఘటన రోజు రాత్రి 10.30 గంటల నుంచి 12.30 గంటల మధ్య ఏ నిముషం లో ఏమి జరిగిందో వివరిస్తూ చంద్ర బాబు సుదీర్ఘ లేఖ రాశారు. ఘటనకు సంబందించిన ఫోటోలను లేఖతో సహా చంద్రబాబు జత చేశారు. ఇంటి దహనం, దాడికి పాల్పడిన వారిని కఠినం గా శిక్షచించాలని చంద్రబాబు లేఖలో కొరారు, బాధిత వర్గం గా ఉన్న 49 మంది టీడీపీ సానుభూతి పరులపై కేసు పెట్టారని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ పై పెట్టిన కేసులో విద్యార్థులు, మహిళలు ఉన్నారని, అసలు ఆ సమయం లో ఊళ్ళో లేని వారిని FIR లో చేర్చారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: