కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు, దళితులపై ప్రేమ తో దళిత బంధు ఇవ్వట్లేదని, ఓట్ల మీద ప్రేమ తోనే  దళిత బంధు ఇస్తున్నారని ఆయన అన్నారు. సీఎం కి నిజాయితీ ఉంటే ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలన్నా ఆయన రైతు రుణమాఫీ ఎందుకు చేయట్లేదు ? అని  ప్రశ్నించారు. పోలీస్ ఎస్కార్ట్ తో వందల కోట్లు తరలిస్తున్నారన్న ఆయన టీఆరెస్ కు హుజురాబాద్ లో డిపాజిట్ రాదని అన్నారు. కుట్రలో భాగస్వామ్యం తప్ప అభివృద్ధి పై హరీష్ రావు కి  ధ్యాస లేదని, కాళీమాత గా అభివర్ణించిన ఇందిరా గాంధీ, ఎన్టీఆర్ వంటి వారు  కూడా ఓడిపోయారు కేసీఆర్ పరిస్థితి కూడా అదే అవుతుందని అని అన్నారు. రెండు గుంటలు ఉన్న వ్యక్తి నిత్యం వందల కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారు ?  నాయకులను ఎలా కొనుగోలు చేస్తున్నారు.. ఇన్నీ హోర్డింగ్స్ ఎలా పెట్టాడు? అని ఆయన  ప్రశ్నించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: