మంత్రి హరీష్ రావు ఈరోజు జ‌మ్మికుంటలో ప‌ర్య‌టించారు. ఈ సంధ‌ర్భంగా హ‌రీష్ రావు మాట్లాడుతూ...బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయ‌లు ఇస్తున్నారా..? అంటూ ప్ర‌శ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రూ. 2 వేల పెన్షన్ ఇస్తున్నారా..? అంటూ హ‌రీష్ రావు వ్యాఖ్యానించారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో 24 గంటల విద్యుత్ ఇస్తున్నారా? అని హ‌రీష్ రావు వ‌రుస ప్ర‌శ్న‌లు కురిపించారు. పెట్రోల్, డీజిల్, వంట నూనె మ‌రియు గ్యాస్ ధరలు పెంచింది బీజేపీ కాదా? అంటూ హ‌రీష్ రావు మండిప‌డ్డారు.

కరోనా మ‌హ‌మ్మారి లేకుంటే ఇప్పటికే రైతు రుణమాఫీ పూర్తి అయ్యేదని హ‌రీష్ రావు తెలిపారు. అంతే కాకుండా కొత్త బడ్జెట్ లో మిగిలిన రైతు రుణమాఫీ పూర్తి చేస్తామ‌ని హ‌రీష్ రావు హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ కుడి చేయితో ఇస్తుంటే.. కేంద్రం ఎడమ చేయితో లాక్కుంటోందని హ‌రీష్ రావు ఆరోప‌ణ‌లు చేశారు. మాయ మాటలు.. మోసపూరిత మాటలను నమ్మొద్దంటూ హ‌రీష్ రావు హిత‌వు ప‌లికారు.

మరింత సమాచారం తెలుసుకోండి: