బండి సంజయ్ పాదయాత్ర పుణ్యమా అని బిజెపి నేతలు కాస్త స్పీడ్ గా వ్యాఖ్యలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ మీడియాతో మాట్లాడుతూ... ఘాటు కామెంట్స్ చేసారు. త్వరలో కేసీఆర్ దుకాణం బంద్ అవుతుంది అని అన్నారు ఆయన. బండి సంజయ్ పాదయాత్ర చూసి.. టీఆరెస్ భయపడుతోంది అని వ్యాఖ్యానించారు.

కేసీఆర్ సర్కార్ లో డ్రగ్స్ మాఫియా, సాండ్, ల్యాండ్ మాఫియాలు పెరిగాయి అన్ని విమర్శలు చేసారు. అసెంబ్లీ లో ఒక్క ఎమ్మెల్యే ఉంటే ఒక్క నిమిషమే సమయం ఇస్తారా అని ప్రశ్నించారు. చిన్న బామ్మర్ది ( అక్బరుద్దీన్ ఓవైసీ) మాట్లాడితే మాత్రం అధిక సమయం ఇస్తారా అని నిలదీశారు. ఐదు నిమిషాలు సమయం ఇస్తే.. చాలు బట్టలిప్పేసి కొడతాం అని గుర్తు పెట్టుకో బిడ్డా అంటూ వార్నింగ్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp