రాజన్న సిరిసిల్ల జిల్లాలో బిజెపి నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. బండి సంజయ్ పాదయాత్రలో పాల్గొన్న నేతలు కాస్త ఘాటుగా విమర్శలు చేసారు. బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ... సిరిసిల్ల రోడ్ల మీద ఎస్కార్ట్ లేకుండా కేటీఆర్ వెళ్లగలరా అని ప్రశ్నించారు. అమెరికా నుంచి వచ్చిన కేటీఆర్ ఆ మాకు చెప్పేది అని అంటూ ఆయన నిలదీశారు.

దళితులకు ఇచ్చిన భూములెంత, తీసుకున్న భూములు ఎంత అని ప్రశ్నించారు. కేటీఆర్.. అసెంబ్లీ సాక్షిగా శ్వేత పత్రం విడుదల చేయగలరా అని ఆయన నిలదీశారు. దళిత , గిరిజన భూముల మీద చర్చ పెట్టగలరా అంటూ ప్రశ్నించారు. ఒక్కరికి అవకాశం ఇచ్చి..చిత్త శుద్ధి నిరూపించుకోండి అని ఆయన సూచించారు. నిరుద్యోగ భృతి మీద చర్చ పెట్టాలి అని ఎమ్మెల్యే డిమాండ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp